Punganur: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం
Punganur: పుంగనూరు నియోజకవర్గo నందు రాజంపేట పార్లమెంటుకు నూతన పార్లమెంట్ జోనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన స్టేట్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య మరియు పుంగనూరు నియోజకవర్గ అబ్జర్వర్ శాప్ చైర్మన్ రవి నాయుడు గారితో కలిసి పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి )
ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని గురించి చర్చించడం జరిగింది. దామచర్ల సత్య గారు మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలియజేసి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే పార్టీకి మంచి పేరు తీసుకురావాలని విశ్వసించారు.

