MNCL: వేమనపల్లి మండలంలోని హనుమంతుని ఆలయంలో గత నెల డోకె వెంకటిపై కట్టెతో దాడి చేసిన ఘటనలో నిందితుడు ఎల్లెల శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నట్లు SI పేర్కొన్నారు.

